Telangana Corona: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్ శ్రీనివాస్
Telangana Corona: మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా ఫోర్త్వేవ్లో ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు..
Telangana Corona: మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా ఫోర్త్వేవ్లో ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి అని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని, దేశంలో పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 2 శాతానికి పెరిగిందని అన్నారు. తెలంగాణలో దాదాపు 10 వారాల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 100 దాటిందని వివరించారు. తెలంగాణలో కేసుల సంఖ్య 355 నుంచి 555కు పెరిగిందన్నారు.
8 వారాలుగా నమోదు కాని కోవిడ్ మరణాలు! కాగా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 వారాలుగా ఒక్క క రోనా మరణం కూడా నమోదు కాలేదని అన్నారు. మరో నాలుగైదు వారాలపాటు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ప్రజలు సహకరించకపోతే మరోసారి మాస్క్ ధరించని వారికి ఫైన్ వేసే పరిస్థితులు వస్తాయన్నారు. రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని, అయినా జాగ్రత్తలు పాటిస్తుంటే ఎంతో మంచిదంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి