Telangana: భారీ వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు..
తెలంగాణలో భారీ వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు మిగిల్చే నష్టం అంతా ఇంతా కాదు..
Telangana: తెలంగాణలో భారీ వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు మిగిల్చే నష్టం అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు ఈవర్షాలు భారీ నష్టాన్నే మిగులుస్తాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి.. పంట వస్తుందనే ఆశతో ఎదురుచూసే రైతన్న ఆశలను వర్షాలు ఆవిరి చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు రైతన్నలు.. తెలంగాణలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లాలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. దీంతో వ్యవసాయ పెట్టుబడులకు తాము చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా కరీంగనర్ జిల్లాలో పత్తి పంటకు అపార నష్టం కలిగింది. వరికి బదులు పత్యామ్నయ పంటలపై దృష్టిసారించాలంటూ ప్రభుత్వం చెప్పడంతో ఈసారి వరికి బదులు.. చాలా మంది రైతులు అధికంగా పత్తిని సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు రైతులు. గతేడాది తెల్లబంగారానికి మంచి డిమాండ్ ఉండడంతో ఈసారి ఎక్కువ శాతం సాగుచేశారు. మొక్కమెలిచిన నాటి నుంచి వర్షాలు భారీగా కురవడంతో కొన్నిచోట్ల పంట మునిగిపోయింది. మరి కొన్నిచోట పెరుగుదల దశలోనే పంటను కీటకాలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు ఇప్పటికే రూ. 40 వేలు పెట్టుబడి పెట్టామని.. అసలు కూడా వచ్చే పరిస్థితి లేదని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని, వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని, పరిహారం ఇవ్వాలంటున్నారు రైతులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..