Telangana Congress: నేడు గవర్నర్తో సమావేశం కానున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు
Telangana Congress: తెలంగాణలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తడం, మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరుగుతుండటం తదితర..
Telangana Congress: తెలంగాణలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తడం, మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరుగుతుండటం తదితర సమస్యలపై శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులు గవర్నర్తో సమావేశం కానున్నారు. 12 గంటలకే రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో సమావేశం కానున్నారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌడరీ, ఎమ్మె,ల్యే సీతక్క, కొండా సురేఖ తదితరులు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు శాంతి భద్రతల సమస్యలు తలెత్తడం.. మైనర్ బాలికలపై అత్యాచారాలు అవుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించనున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి