Bandi Sanjay: త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతా.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు!
కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Bandi Sanjay hot comments on KCR, Jagan: కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జల వివాదం లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏ ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ రావాల్సిన నీటి వాట గురించి కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ యధేచ్చగా జల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతామని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల సీఎంలు కమీషన్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 2015 ఒప్పందం ప్రకారం.. తెలంగాణకి 575 టీఎంసీలు రావాల్సిఉంటే.. ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తున్నారు అని నిలదీశారు. రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు రెండు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కోసమే ఇద్దరు సీఎంల హైడ్రామా చేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
Read Also…
TPCC Chief Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్.. అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలింపు