BJP: బీజేపీలోకి మరో కీలక నేత.. తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మారుతున్న లెక్కలు..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు వస్తుండటంతో బిగ్ స్కెచ్ వేశారు. పార్టీలో చేరికలపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. కాసేపట్లో పదాధికారుల సమావేశంలో ఈ రెండు అంశాలపై..
మునుగోడు వేదికగా పొలిటికల్ హీట్ పెరిగింది. అంతేకాదు బీజీపీలో మరింత జోష్ పెంచింది. ఈ నెల 21న మునుగోడులో బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు వస్తుండటంతో బిగ్ స్కెచ్ వేశారు. పార్టీలో చేరికలపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. కాసేపట్లో పదాధికారుల సమావేశంలో ఈ రెండు అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. కిష్టాయిగూడెంలో జరిగే ఈ మీటింగ్కు బీజేపీ కీలక నేతలు హాజరవుతున్నారు. గురువారం కోరుట్లలో జరగనున్న బహిరంగసభలో కీలక నేతలు చేరుతారని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. భారీగా చేరికలు ఉంటాయని తరుణ్చుగ్ వెల్లడించడం మరింత ఆసక్తికరంగా మారింది. పార్టీ కార్యాచరణను అమిత్ షా ప్రకటిస్తారని వెల్లడించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. తెలంగాణకు ప్రధాన శత్రువు అవినీతి, కుటుంబ రాజకీయాలు. మేము అవినీతి గురించి మాట్లాడితే కేసీఆర్కు ఎందుకింత భయం. మాజీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ నియంతృత్వం ఎలా ముగిసిందో.. అలాగే కేసీఆర్కు ముగింపు వస్తుంది. అమిత్ షా సభతో తెలంగాణకు కుటుంబ రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఇటు జనగామ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ 15వ రోజు కొనసాగుతోంది. ప్రజా సంగ్రామ యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం