Station Ghanpur MLA: భార్యతో కలిసి పొలం పనులు చేసిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే.. వరి చేనులో కలుపు తీసి..
Station Ghanpur MLA: ప్రజాప్రతినిధులు అంటే నిత్యం ఏదో రకంగా బిజీగానే ఉంటుంటారు. పరిపాలన, ప్రజా సేవ, ఇతర పనుల్లో నిమగ్నమైపోతుంటారు.
Station Ghanpur MLA: ప్రజాప్రతినిధులు అంటే నిత్యం ఏదో రకంగా బిజీగానే ఉంటుంటారు. పరిపాలన, ప్రజా సేవ, ఇతర పనుల్లో నిమగ్నమైపోతుంటారు. అచ్చం ఇలా నిత్యం ప్రజా సమస్యలు, పలు అభివృద్ధి పనుల్లో బిజీబిజీగా ఉండే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య తాజాగా కాస్త సేద తీరారు. అలాగని రెస్ట్ తీసుకోలేదండోయ్.. వ్యవసాయక్షేత్రంలో చిన్న చిన్న పనులు చేశారు. శనివారం నాడు ఎమ్మెల్యే రాజయ్య తన సతీమణితో కలిసి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఆమెతో కలిసి పొలం పనులు చేశారు. మామిడి తోటను, వరి పొలాన్ని పరిశీలించి పంట పొలమంతా కలియతిరిగారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం గ్రామ శివారులో ఎమ్మెల్యే రాజయ్యకు స్వంత వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇవాళ ఆ వ్యవసాయ క్షేత్రానికి రాజయ్య తన భార్యతో కలిసి వెళ్లారు. ప్రజాప్రతినిధిగా బిజీ బిజీగా గడిపే రాజయ్య.. కాస్త సమయం తీసుకుని తన పంట పొలంలో సందడి చేశారు. వ్యవసాయ క్షేత్రంలోని పంటలను పరిశీలించారు. వరి పొలంలో కలుపు మొక్కలు తీశారు. అనంతరం సపోటా తోటను కూడా పరిశీలించారు. చెట్లకు కాసిన సపోటా పండ్లను కోసి రుచి చూశారు. కాగా, ఎమ్మెల్యే రాజయ్య తన భార్యతో కలిసి పొలం పనుల్లో పాల్గొనడంతో స్థానిక రైతులు ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే రాజయ్య వ్యవసాయ క్షేత్రంలో ఉన్నంత సేపు ఆయనను అక్కడి రైతులు ఆసక్తిగా చూశారు.
Also read: