బాలికను దారుణంగా అంతమొందించిన సొంత పిన్ని

హైదరాబాద్ మౌలాలి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను అత్యంత దారుణంగా సొంత పిన్ని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ప్రియుడి మోజులో కృష్ణకుమారి అనే మహిళ సొంత అక్క కూతురిని చంపేసింది. జ్ఞానేశ్వరి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా స్మశానానికి తీసుకొచ్చిన సమయంలో పోలీసులు ఎంటరయ్యారు. కృష్ణకుమారి, ఆమె ప్రియుడు శివారెడ్డి ప్రవర్తన అనుమానస్పదంగా ఉండడంతో అంత్యక్రియల కోసం వచ్చినవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరిని విచారిండంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను తామే […]

బాలికను దారుణంగా అంతమొందించిన సొంత పిన్ని
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2019 | 10:43 AM

హైదరాబాద్ మౌలాలి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను అత్యంత దారుణంగా సొంత పిన్ని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ప్రియుడి మోజులో కృష్ణకుమారి అనే మహిళ సొంత అక్క కూతురిని చంపేసింది. జ్ఞానేశ్వరి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా స్మశానానికి తీసుకొచ్చిన సమయంలో పోలీసులు ఎంటరయ్యారు.

కృష్ణకుమారి, ఆమె ప్రియుడు శివారెడ్డి ప్రవర్తన అనుమానస్పదంగా ఉండడంతో అంత్యక్రియల కోసం వచ్చినవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరిని విచారిండంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను తామే హత్య చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు.

మూడు నెలల క్రితమే బాలిక తల్లి చనిపోవడంతో జ్ఞానేశ్వరి పిన్ని కృష్ణకుమారి దగ్గర ఉంటోంది. అయితే.. ఆమెను పోషించడం భారంగా భావించింది కృష్ణకుమారి. జ్ఞానేశ్వరి తలను గట్టిగా గోడకు కొట్టాడు ఆమె ప్రియుడు శివారెడ్డి. పాప అరవకుండా కృష్ణకుమారి నోరు మూసింది. దీంతో ఆ పాప చనిపోయింది.