TS RTC: ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు సజ్జనార్ మరో కీలక నిర్ణయం.. ఆదాయాన్ని పెంచేందుకు..
TS RTC MD VC Sajjanar: నష్టాల్లో ఉన్న.. తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని
TS RTC MD VC Sajjanar: నష్టాల్లో ఉన్న.. తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్న సజ్జనార్.. శుభకార్యాల సమయంలో ఆర్టీసీ బస్సులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులను సెక్యూరిటి డిపాజిట్ లేకుండానే బుక్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ మేరకు సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
పెళ్లిళ్లు, వేడుకలు, దూర ప్రాంతాల టూర్లకు బృందాలుగా వెళ్లేందుకు ముందస్తు సెక్యూరిటీ డిపాజిట్ చేయకుండా.. బస్సులను బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్టు వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బస్సు అవసరమైన వారు సమీప డిపో మేనేజర్ను సంప్రదించాలంటూ సూచించారు. దీంతోపాటు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు.. 040-30102829, 040-68153333 ద్వారా ప్రజలు సమాచారం పొందవచ్చండి సూచించారు.
ఎటువంటి అడ్వాన్స్ లేకుండానే వివాహాది శుభకార్యాలకు టీఎస్ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. #Telangana రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో కోరారు.@tsrtcmdoffice pic.twitter.com/alrlsLExjP
— AIR News Hyderabad (@airnews_hyd) October 23, 2021
Also Read: