Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. 17 మందికి గాయాలు..
Road Accident: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని గౌలిగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ డెడ్ అవగా..
Road Accident: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని గౌలిగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ డెడ్ అవగా.. 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకెళితే.. గౌలిగూడ సమీపంలో జాతీయ రహదారి 44పై రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మ ఆలయం నుంచి ఆదిలాబాద్కు టాటా ఏస్లో 13 మంది భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు. టాటా సఫారీ నేరడిగొండ మండలం కొరటికల్(బి) నుంచి నిర్మల్ వెళ్తోంది. అయితే, నేరడిగొండ మండలంలోని గౌలిగూడ సమీపంలో టాటా సఫారీ, టాటా ఏస్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ వెనుకనే వచ్చిన మరో వాహనం.. ఈ రెండు వాహనాలను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. ఆదిలాబాద్కు చెందిన పవన్, శేఖర్, నవనీత్తో పాటు కొరటికల్ దాబా వద్ద టైర్ పంక్చర్ మెకానిక్ దుకాణం నడుపుకునే సాబొద్దిన్కు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్కు చెందిన పది మందితో పాటు కొరటికల్కు చెందిన ముగ్గురికి స్వల్పగాయాలు. టాటాఏస్ డ్రైవర్ పవన్.. డ్రైవర్ సీట్లో ఇరుక్కోవడంతో అరగంటపాటు శ్రమించి బయటకు తీసి అంబులెన్స్లో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని ప్రాథమిక అంచనా వచ్చారు పోలీసులు.
Also read: Bigg Boss 5 Telugu: బయటకు వచ్చేసిన ప్రియాంక.. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే..
Balayya Talk Show: బాలకృష్ణ టాక్షోలో సూపర్ స్టార్ మహేష్బాబు సందడి.. ఫోటోలు వైరల్..!