Telangana: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్రావు సమీక్ష.. కొత్త వేరియంట్పై చర్చ
Telangana: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్త వేరియంట్, థర్డ్వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై..
Telangana: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. కొత్త వేరియంట్, థర్డ్వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రజారోగ్యం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ కొనసాగింది. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ వేరియంట్పై మంత్రి హరీష్ రావు అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అయితే ఆయా దేశాల నుంచి నేరుగా హైదరాబాద్కు విమానాలు లేని కారణంగా ముంబై, ఢిల్లీలో దిగి హైదరాబాద్కు వచ్చే వారిని ట్రేసింగ్ చేసి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
సోమవారం కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటలపై చర్చించనున్నారు. అలాగే కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్ తదితర అంశాలపై కేసీఆర్ అధికారులతో చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి: