Land Mafia: ఆదిలాబాద్ జిల్లాలో రియల్టర్ల అరాచకాలు.. భూమి అమ్మాలంటూ సామాన్యులకు వేధింపుల..
రాజులతండాలో భూ వివాదం నడుస్తోంది. ఆరు కుటుంబాలకు చెందిన భూమిపై రియల్టర్లు కన్నేశారు. భూమిని తమకు అమ్మాలంటూ బెదిరింపులకు దిగారు. ఒక్కో కుటుంబాన్ని టార్చర్ పెట్టారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితులంతా..
ఆదిలాబాద్జిల్లాలో(Adilabad District) అత్యంత దారుణమైన పరిస్థితి. రియల్టర్ల(Realtors)బెదిరింపులతో కొన్ని రోజులుగా ఆరు కుటుంబాలు ఊరు విడిచిపెట్టి పంటపొలల్లానో నివాసం ఉంటున్నారు. తమ భూమిని కాపాడుకునేందుకు అక్కడే బస చేశారు. నేరడిగొండ మండలం బుద్దికొండ పంచాయతీ పరిధిలోని రాజులతండాలో భూ వివాదం నడుస్తోంది. ఆరు కుటుంబాలకు చెందిన భూమిపై రియల్టర్లు కన్నేశారు. భూమిని తమకు అమ్మాలంటూ బెదిరింపులకు దిగారు. ఒక్కో కుటుంబాన్ని టార్చర్ పెట్టారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా..పోలీసులు రియల్టర్లకే వత్తాసు పలకడంతో చేసేదిలేక..ఉన్నవారిని వదిలిపెట్టి…పొలంలోనే తల దాచుకుంటున్నారు.
ఇంతకీ ఎవరా రియల్టర్లు..? పోలీసులు వారి గోస ఎందుకు పట్టించుకోవడం లేదు..? రియల్టర్లు భూములు ఎందుకు లాగేసుకోవాలనుకుంటున్నారు..? రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. దాంతో టీవీ9 ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పటికైనా బాధితులకు అధికారులు న్యాయం చేస్తారా..? మరి చూడాలి.
ఇవి కూడా చదవండి: Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుపాను.. మరో 24 గంటల్లో తీరానికి దగ్గరగా వస్తుందంటున్న ఐఎండీ..
Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..