President Elections: నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్.. ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్..
President Elections 2022: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) సోమవారం (జూన్ 27) ఉదయం 11:30 గంటలకు తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరపున..
President Elections 2022: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) సోమవారం (జూన్ 27) ఉదయం 11:30 గంటలకు తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. కాగా ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.
కాగా జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, 21న కౌంటింగ్ జరుగుతుంది. నామినేషన్లు జూన్ 29వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. జులై 21 లోగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24వ తేదీతో ముగియనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..