Pranahitha Puskara: ప్రాణహితకు పుష్కర శోభ.. 13వ తేదీ నుంచి 24 వరకు పుష్కరాలు..!

Pranahitha Puskara: ప్రాణహిత పుష్కర శోభను సంతరించుకుంది. బుధవారం నుండే పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 13 నుండి 24ల వరకూ పుష్కరాలు కొనసాగనున్నాయి.

Pranahitha Puskara: ప్రాణహితకు పుష్కర శోభ.. 13వ తేదీ నుంచి 24 వరకు పుష్కరాలు..!
Pranahitha
Follow us

|

Updated on: Apr 12, 2022 | 5:42 AM

Pranahitha Puskara: ప్రాణహిత పుష్కర శోభను సంతరించుకుంది. బుధవారం నుండే పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 13 నుండి 24ల వరకూ పుష్కరాలు కొనసాగనున్నాయి. ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు.

బుధవారం నుంచి ప్రాణహిత పుష్కరాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణను విడదీస్తూ పారుతున్న ప్రాణహితకు 13 నుంచి పుష్కర శోభ రానుంది. వార్ధా-పెన్‌గంగా నదుల కలయికతో కొమురంభీంజిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద పురుడుపోసుకున్న ప్రాణహిత 3 జిల్లాలు,3 రాష్ట్రాల సరిహద్దులను ముద్దాడుతూ 113 కిలోమీటర్లు గలగలపారుతూ త్రివేణి సంగమంలో అంతర్థానం అవుతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, అటు మహారాష్ట్ర వైపు సిరోంచ, నగరం వద్ద పుష్కరాలు కొనసాగనున్నాయి. పుష్కరాల నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయలేదని.. అసలు ప్రాణహిత పుష్కరాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈనెల 13 నుంచి 24 వరకు ప్రాణహిత నదికి పుష్కరాలు కొనసాగుతాయి. ఈ 12 రోజులు ప్రాణహిత నది తీరం, త్రివేణి సంగమం భక్తజన జాతరగా మారనుంది. మహారాష్ట్ర సిర్వంచ, తెలంగాణ అర్జునగుట్ట వద్ద రోజుకు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారని అంచనా. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల్ అర్జునగుట్ట వద్దకు వెళ్లేందుకు బబ్బెరిచెలక నుంచి రహదారిని సిద్ధం చేశారు. వీఐపీల కోసం జైపూర్ ఎస్టీపీపీలో హెలిప్యాడ్ కూడా సిద్ధం చేశారు అదికారులు. వేమనపల్లి, తుమ్మిడి హెట్టి ఘాట్లకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం, మౌలిక వసతులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అటు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరాలు ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేసింది అక్కడి శివసేన సర్కార్. అక్కడి ప్రభుత్వం పుష్కరాల నిర్వహణకు రూ. 10 కోట్లు కేటాయించింది. మరోవైపు ప్రాణహిత పుష్కరాల నేపథ్యంలో పలు ప్రాంతాల నుండి ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను నడుపుతోంది.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..

అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..