Crime News: కన్న కొడుకునే హత్య చేయించిన తల్లిదండ్రులు.. కారణం అదే.. హుజుర్ నగర్ లో వెలుగు చూసిన ఘటన..

సాధారణంగా పిల్లలపై తల్లిదండ్రులకు ఎంతో ప్రేమాభినాలు ఉంటాయి. కొడుకు తప్పు చేసినా పైకి మందలించినా, లోలోపల కుమారుడిపై ఎనలేని ప్రేమ ఉంటుంది. పిల్లలకు చిన్న గాయమైనా తల్లిదండ్రులు తట్టుకోలేరు. కొన్ని సందర్భాల్లో పిల్లలు..

Crime News: కన్న కొడుకునే హత్య చేయించిన తల్లిదండ్రులు.. కారణం అదే.. హుజుర్ నగర్ లో వెలుగు చూసిన ఘటన..
Own Son Murder (Representative image)
Follow us

| Edited By: Phani CH

Updated on: Nov 01, 2022 | 3:02 PM

సాధారణంగా పిల్లలపై తల్లిదండ్రులకు ఎంతో ప్రేమాభినాలు ఉంటాయి. కొడుకు తప్పు చేసినా పైకి మందలించినా, లోలోపల కుమారుడిపై ఎనలేని ప్రేమ ఉంటుంది. పిల్లలకు చిన్న గాయమైనా తల్లిదండ్రులు తట్టుకోలేరు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఎవరైనా తప్పులు చేసినా, తమ పిల్లలే కదా అని సర్ధుకుపోతుంటారు. కన్న పేగు ప్రేమను ఎంత వర్ణించినా తక్కువే. కాని తెలంగాణలో మాత్రం ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకును చంపించేందుకు తల్లిదండ్రులే సుపారీ ఇచ్చిన ఘటన తెలంగాణ రాష్ట్రం హుజూర్ నగర్ పరిధిలో జరిగింది. కుమారుడి తీరు, ప్రవర్తన పట్ల విసిగిపోయిన తల్లిదండ్రులు.. ఇలాంటి కొడుకు ఉన్నా, లేకున్నా ఒకటే అని భావించారు. యువకుడి మేనమామ ద్వారా కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్‌ వద్ద అక్టోబరు 19వ తేదీన మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన కేసు దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఘటన దర్యాప్తులో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.

ఖమ్మానికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్‌, రాణిబాయి దంపతులకు కుమారుడు సాయినాథ్‌ వయస్సు 26 సంవత్సరాలు. రామ్‌సింగ్‌ సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసిన సాయినాథ్‌.. వ్యసనాలకు బానిసగా మారాడు. నాలుగేళ్లుగా డబ్బుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే వేధించేవాడు. ఇటీవల కన్నతల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కుమారుడిని చంపాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నివాసముంటున్న రాణిబాయి తమ్ముడు సత్యనారాయణసింగ్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. తన అక్క, బావలు చెప్పిన విషయాన్ని సమర్థించిన సత్యనారాయణ సింగ్ తనకు తెలిసిన మిర్యాలగూడ మండలం ధీరావత్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ రమావత్‌ రవిని ఆశ్రయించాడు. అదే తండాకు చెందిన పనుగొతు నాగరాజు, బూరుగు రాంబాబు, త్రిపురారం మండలం రాజేంద్రనగర్‌కు చెందిన ధనావత్‌ సాయితో రూ.8 లక్షలకు హత్య చేసేందుకు రవి ఒప్పందం చేసుకున్నాడు. అక్టోబరు 18వ తేదీన సత్యనారాయణసింగ్‌, రవి కలిసి నల్గొండ జిల్లా కల్లేపల్లిలోని మైసమ్మ దేవాలయం వద్ద పార్టీ చేసుకుందామని సాయినాథ్‌ను తీసుకెళ్లారు. అందరూ కలిసి మద్యం తాగి.. సాయినాథ్‌ మెడకు ఉరి బిగించి చంపేశారు. సాయినాథ్‌ కారులోనే శవాన్ని తీసుకెళ్లి  మూసీ నదిలో పడేశారు. మరుసటి రోజు శవం నదిలో తేలడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

వార్తల ద్వారా విషయం తెలిసిందంటూ మూడు రోజులకు తల్లిదండ్రులు వచ్చి మృతదేహన్ని తీసుకెళ్లారు. సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించిన పోలీసులు.. హత్య రోజు శూన్యంపహాడ్‌ వద్ద కనిపించిన కారు.. మృతుడి తల్లిదండ్రులు తీసుకొచ్చిన కారు ఒకటేనని నిర్ధారించుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన మృతుడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. కొడుకును తామే చంపించినట్లు ఒప్పుకొన్నారు. తల్లిదండ్రులు, మేనమామతో పాటు హత్యకు సుపారి తీసుకున్న వారిలో నలుగురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కన్న కుమారుడి ప్రవర్తన పట్ల విసుగుచెందటం వలనే సాయినాధ్ ను వారి తల్లిదండ్రులు చంపించాలని నిర్ణయించుకున్నారు. ఎంత చెప్పి చూసినా మార్పు రాకపోవడంతో పాటు, తల్లిదండ్రుల మీదకు తిరగబడటం, చెప్పిన మాట వినకుండా చెడు అలవాట్లకు బానిస కావడంతో కుమారుడి హత్యకు సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

Also Read:

Minister KTR: బీజేపీ మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?