మనసున్న ఖాకీలు.. 38 మంది ఏకమయ్యారు.. “కన్న ఊరు” రుణం ఇలా తీర్చుకుంటున్నారు
వాళ్ళందరూ 2009 సంవత్సరంలో పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్ పొందారు. అందరూ ఒకే జిల్లాకు చెందిన వారే కావడంతో ఒక బ్యాచ్ గా ఏర్పడ్డారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 38 మంది పోలీసు అధికారులు.
వాళ్ళందరూ 2009 సంవత్సరంలో పోలీసు ఉద్యోగం కోసం ట్రైనింగ్ పొందారు. అందరూ ఒకే జిల్లాకు చెందిన వారే కావడంతో ఒక బ్యాచ్ గా ఏర్పడ్డారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 38 మంది పోలీసు అధికారులు. ఇందులో ఎస్సైలు, సిఐ స్థాయి అధికారులూ ఉన్నారు. వీళ్ళందరు వృత్తిరీత్యా వేరువేరు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సంవత్సరంలో ఒకరోజు అందరూ కలిసి ఏదో ఓ కార్యక్రమాన్ని చేపడుతుంటారు.
38 మందిలో ఒక్కొక్కరి గ్రామంలో ఒక్కో సంవత్సరం సేవా కార్యక్రమాలు చేపడతారు. ఆ గ్రామానికి చెందిన వారికి మాత్రమే కాకుండా ఇతర గ్రామాలకు చెందిన పేదలకు సహాయం అందజేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం మాచారెడ్డి మండలంలోని ఫరీద్ పేట గ్రామంలో ‘కన్నఊరు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన పోలీసు అధికారులకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, సదాశివనగర్ ఎస్సై నరేష్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 మంది పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే పాఠశాలలో ఏళ్ల తరబడి పని చేస్తున్న మల్లేశం అనే వ్యక్తికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఉన్నత స్థానంలో ఉండటమే కాదు సమాజానికి కాస్తయినా సేవ చేయాలన్న సంకల్పంతో గత 11ఏళ్లుగా ‘కన్నఊరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ వల్ల తమ గొప్ప చెప్పుకోవడం లేదని, తమను ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వస్తారన్నదే తమ ఆలోచన అని చెబుతున్నారు.
Also Read:
Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు
Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..