నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసుల విచారణ.. రూ.10వేల పూచీకత్తు సమర్పించాలని ఎమ్మెల్యే సీతక్కకు ఆదేశం..
Nampally Court: నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసులపై మంగళవారం విచారణ జరిగింది. తొలుత ఎన్నికల నియమావళి కేసుపై విచారణ జరుగగా..
Nampally Court: నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో పలు కేసులపై మంగళవారం విచారణ జరిగింది. తొలుత ఎన్నికల నియమావళి కేసుపై విచారణ జరుగగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విచారణకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం.. సీతక్కపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను ఉపసంహరించింది. అయితే, రూ.10 వేల పూచికత్తును సమర్పించాలని సీతక్కను కోర్టు ఆదేశించింది. మరోకేసులో సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరుకానందుకు నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్హెచ్ఓపై దర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాజిరెడ్డి గోవర్ధన్పై ఎన్బీడబ్ల్యూ అమలు చేయనందుకు కోర్టుకు హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించింది. అయితే, ఎస్హెచ్ఓ కోర్టుకు హాజరు కాలేదు. దాంతో ఆగ్రహించిన ధర్మాసనం.. నిందితుడిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్కు సహకరించేలా వ్యవహరిస్తున్నారని డీజీపీకి సమాచారం అందించింది. నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించింది. ఇక వేర్వేరు కేసులో గూడెం మహిపాల్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, సెబాస్టియన్ లు కోర్టు ముందు హాజరయ్యారు. అయితే మరో కేసులో విచారణకు కావాలని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
Also read: