Telangana: దేవుడి సన్నిధిలో గడిపేందుకు వెళ్తూ.. ఏకంగా దేవుడి దగ్గరికే.. తల్లీకూతురు దుర్మరణం
విధి మనుషుల జీవితాలతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. తాజాగా తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది.
Suryapet district: విధి మనుషుల జీవితాలతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో చెప్పలేం. తాజాగా తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. దేవుడి సన్నిధిలో గడిపేందుకు వెళ్తే.. ఏకంగా దేవుడి దగ్గరికే వెళ్లిపోయారు తల్లీ, కుమార్తె. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం(tungaturthi mandalam) కాశిపేట వద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆటో బోల్తా పడిన ఘటనలో తల్లి, కుమార్తె స్పాట్లో దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రావులపల్లి ఎక్స్ రోడ్ తండాకు చెందిన గుగులోతు మంగమ్మ తండ్రి ఇటీవలే కాలం చేశారు. దీంతో సాంప్రదాయం ప్రకారం.. అర్వపల్లి గుడిలో నిద్ర చేసేందుకు మంగమ్మ బయలుదేరింది. మంగమ్మతో పాటు ఆమె కుమార్తెలు, మరిదితో కలిపి మొత్తం ఐదుగురు శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆటోలో బయలుదేరారు. కొంత దూరం వెళ్లిన తర్వాత.. ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మంగమ్మతో పాటు ఓ కుమార్తె(శారద) స్పాట్లో మరణించారు. ఆటోలో ఉన్న మిగతా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మూడో కూతురైన నీలమ్మకు నడుము విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Also Read: పోలీసులకు అతడి గురించి రహస్య సమాచారం.. ఇంటికెళ్లి స్విచ్ బోర్డులు, కరెంట్ మీటర్ చెక్ చేస్తే షాక్
ఈ పూలతో ఇగురు పెట్టి తింటే.. అస్సలు వదలరు.. టేస్ట్ అద్భుతం.. పోషకాలు అమోఘం