సిరిసిల్ల జిల్లాను కోనసీమలా మారుస్తా: కేటీఆర్

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో గౌడ కమ్యూనిటీ హాల్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి 5 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు సరఫరా చేయడం లేదు. అల్మాస్‌పూర్ చెరువును నీటితో నింపడమే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కోనసీమకు దీటుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. వృత్తి […]

సిరిసిల్ల జిల్లాను కోనసీమలా మారుస్తా: కేటీఆర్
Follow us

| Edited By:

Updated on: Nov 08, 2019 | 8:06 PM

ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో గౌడ కమ్యూనిటీ హాల్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి 5 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు సరఫరా చేయడం లేదు. అల్మాస్‌పూర్ చెరువును నీటితో నింపడమే కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాను కోనసీమకు దీటుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. వృత్తి మీద ఆధారపడే వారికి అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నాం. ఒక్క అల్మాస్‌పూర్ చెరువే కాదు జిల్లాలోని అన్ని చెరువులు నింపుతాం. అన్ని కులవృత్తులకు అండగా నిలుస్తున్నాం. ఇప్పటికే రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. దేశంలోనే ధనిక రైతులు తెలంగాణలో ఉండేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని’ మంత్రి వివరించారు.