Minister KTR: కిషన్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. మెడికల్ కళాశాలల మంజూరు విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు
మెడికల్ కాలేజీల కేటాయింపు విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. మెడికల్ కళాశాలల విషయంలో కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు
తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని బీజేపీ నేతలు అంటుంటే.. అవన్నీ ఒట్టి మాటలేనని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేస్తున్నారు.ఈనేపథ్యంలో మెడికల్ కాలేజీల కేటాయింపు విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. మెడికల్ కళాశాలల విషయంలో కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘ కిషన్ రెడ్డి గారూ..నేను మిమ్మల్ని సోదరునిగా గౌరవిస్తాను. కానీ మెడికల్ కళాశాలల కేటాయింపు గురించి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. మీ లాంటి కేంద్ర కేబినెట్ మంత్రిని చూడలేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని మీరు ప్రకటించారు, అది అబద్ధం’
‘ కిషన్ రెడ్డి కి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదు. హైదరాబాదులో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మీరు ప్రకటించారు. ఎప్పటిలాగే, మీ గుజరాతీ బాస్లు దానిని వారి రాష్ట్రానికి మార్చారు. ఈ విషయంలో మీరు హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇంత జరుగుతున్నా మీరు మీ తప్పుడు వాదనలను సరిదిద్దుకోలేదు. తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి. తెలంగాణకు గానీ, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు గానీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
Dear @kishanreddybjp Garu,
I respect you as a brother but have not seen a more misinformed & hapless Union Cabinet Minister
You had announced that Govt of India sanctioned 9 medical colleges to Telangana which was an utter LIE ?
You didn’t even have the courage to apologise pic.twitter.com/MWtnuXy4DG
— KTR (@KTRTRS) October 1, 2022
Subsequently you had announced that Union Govt intends to establish Global Centre for Traditional medicine in Hyderabad
Of course as usual, your Gujarati Bosses have shifted it to their state
Again, you have misled the people of Hyderabad yet you don’t correct your false claim pic.twitter.com/u6fa62coxZ
— KTR (@KTRTRS) October 1, 2022
Therefore, we demand that the Hon’ble PM Modi Ji to make an official statement on why Govt of India is reneging on its promises to people of Telangana
It’s a shame that Not a single promise made in the APRA has been kept either for Telangana or our sister state of Andhra Pradesh
— KTR (@KTRTRS) October 1, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..