Harish Rao: బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతివ్వండి.. కేంద్రాన్ని కోరిన మంత్రి హరీశ్ రావు

కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Harish Rao: బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతివ్వండి.. కేంద్రాన్ని కోరిన మంత్రి హరీశ్ రావు
Harish Rao
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:42 PM

Harish Rao – Central Govt: ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని.. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషన్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని హరీశ్ రావు కోరారు. నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్తక్‌ క్యాంపెయిన్-2.0పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. రాష్ట్రంలో జరుగుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్ గురించి కేంద్రమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో హరీశ్ రావు మాట్లడుతూ.. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 32 లక్షల కోవిడ్ టీకా డోసులు ఉన్నాయని.. వాటి గడువు తేదీ ముగిసే అవకాశం ఉందని తెలిపారు. అందుకే ప్రికాషన్ డోసుకు అనుమతివ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటికీ టీకా కార్యక్రమంలో భాగంగా పది రోజుల్లో.. 1.30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు హరీశ్ రావు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి