YS Sharmila: రేపు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో సీఎం జగన్‌ సోదరి షర్మిల సమావేశం.. తెలంగాణలో కొత్త పార్టీ అంటూ ప్రచారం..!

YS Sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్‌ లోటస్‌...

YS Sharmila: రేపు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో సీఎం జగన్‌ సోదరి షర్మిల సమావేశం.. తెలంగాణలో కొత్త పార్టీ అంటూ ప్రచారం..!
Follow us

|

Updated on: Feb 08, 2021 | 1:55 PM

YS Sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో ఎజెండాపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ అభిమానులు, అనుచరులతో ఆమె సమావేశం కానున్నారు. సమావేశం ఎందు కోసమని పూర్తిగా క్లారిటీ లేకపోయినా.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని, అందుకే అభిమానులు, అనుచరులతో సమావేశం అవుతున్నారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. వైఎస్‌ఆర్‌ అభిమానులారా రండి.. తరలి రండి ఈ అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాది అంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

కాగా, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు కొంతకాలంగా పుకార్లు షికార్లు అవుతున్నాయి. ఇటీవల ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్‌ కావడంతో షర్మిల స్పందించారు. వస్తున్న వార్తలపై ఖండించారు. ఇంత కాలంగా సైటెంట్‌గా ఉన్న షర్మిల ఒక్కసారిగా అనుచరులు, అభిమానులతో సమావేశం కానున్నట్లు తెలియడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. రేపు సమావేశం జరిగిన తర్వాత వైరల్‌ అవుతున్న వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read:

ముస్లింగా పుట్టి తత్వవేత్తగా మారిన శ్రీ ఎం.. భారత ప్రభుత్వం చేత మన్ననలను పొందుతున్న యోగా గురువు.. ఇంతకీ ఎవరతను..?

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదా..? నిజంగానే తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోయిందా..? కేంద్రం ప్లాన్‌ ఏంటి..?