Telangana: ఇదేం ఫ్రెండ్షిప్ సామీ! దోస్త్కు అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు..
రూపాయి.. రూపాయి ఏం చేస్తావ్ అని అడిగితే.. తండ్రి కొడుకుల మధ్య కొట్లాట పెడతా.. అన్నదమ్ముల బంధానికి స్వస్తి పలుకుతా..
రూపాయి.. రూపాయి ఏం చేస్తావ్ అని అడిగితే.. తండ్రి కొడుకుల మధ్య కొట్లాట పెడతా.. అన్నదమ్ముల బంధానికి స్వస్తి పలుకుతా.. అక్కాచెల్లెలు కొప్పులు పట్టుకుని కొట్టుకునేలా చేస్తా.. దోస్తులను దుష్మన్లుగా మారుస్తా అని అన్నదట. ఇదిగో దోస్తే కదా అని పైసలిచ్చిన పాపానికి దోస్తుకు దుష్మన్గా మారడమే కాదు.. పాపం ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు ఈ వ్యక్తి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి అనే గ్రామానికి చెందిన సంపత్.. సతీష్ అనే తన ఫ్రెండ్కు అవసరముంటే రూ. 30 లక్షలు అప్పుగా ఇచ్చిందట. దానికి కాగితం కూడా రాసుకున్నారట. గడువు తీరింది.. అప్పు తిరిగి ఇస్తాడనుకుంటే.. అందుకు సంబంధించిన ఊసే లేపట్లేదట ఆ దోస్తు. అంతేకాదు పైసలని అతడి ఇంటికి పోయినప్పుడల్లా ముఖం మీద తలుపేసినంత పని చేస్తున్నాడట. ఇక ఇలా కాదని పదిమందిని పిలిచి పంచాయితీ పెడితే.. ఏడు లక్షలు, ఎకరం భూమి ఇస్తాని పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నాడట. అయితే ఇక్కడ కూడా ప్లేట్ పిరయించాడు ఆ ఫ్రెండ్గాడు. పాపం అసలు రాక.. వడ్డీనూ రాకపోవడంతో బీపీ తెచ్చుకుని ఆసుపత్రి పాలయ్యాడు సంపత్. ఆస్పత్రి బిల్లు కట్టేందుకు కూడా సంపత్ దగ్గర డబ్బులు లేకుండాపోయింది. ఆ ఫ్రెండ్ ఇక పైసలు ఇచ్చేటట్లు లేడని.. వాడి ఇంటి ముందే మంచం వేసుకుని నిరసన తెలుపుతున్నాడు సంపత్. అప్పెగొట్టినోళ్లకు.. ఊరు వదిలి పారిపోవడం తెల్వదా.! సంపత్ ఇట్లా ఇంటి దగ్గరకు రాగానే.. వాడు ఇంటికి తాళమేసుకుని పారిపోయాడు. నమ్మి దోస్త్కు అప్పు ఇస్తే.. ఇలా నా ప్రాణం తీస్తున్నాడంటూ సంపత్ విలవిల ఏడుస్తున్నాడు.