Mid Day Meal: ఫుడ్ ఎఫెక్ట్.. మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థుల అస్వస్థత.. పాఠశాల ముందు ఆందోళన.. తర్వాత ఏం జరిగిందంటే..
Mid Day Meal Effect:విద్యార్ధుల మధ్యాహ్నం భోజనం విషతుల్యమవుతోంది. గత కొన్నిరోజులుగా పురుగుల అన్నాన్నే వడ్డిస్తున్నారు పాఠశాల సిబ్బంది. పురుగుల అన్నంపై ..
Mid Day Meal Effect:విద్యార్ధుల మధ్యాహ్నం భోజనం విషతుల్యమవుతోంది. గత కొన్నిరోజులుగా పురుగుల అన్నాన్నే వడ్డిస్తున్నారు పాఠశాల సిబ్బంది. పురుగుల అన్నంపై హెడ్ మాస్టర్ కు కంప్లైంట్ చేసిన పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. పురుగుల అన్నం వడ్డించిన ప్లేట్లను విసిరికొట్టారు. వండిన అన్నంను పడేసి నిరసన తెలిపారు. ఈఘటన మహాబూబ్ నగర్ జిల్లా బోయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. పురుగుల అన్నం తినలేక అవస్థలు పడుతున్నామంటూ ఆరోపిస్తున్నారు విద్యార్థులు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఆందోళనకు దిగామని చెబుతున్నారు విద్యార్థులు. వెంటనే ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పురుగుల అన్నం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరో ఐదుగురు స్టూడెంట్స్ పురుగుల అన్నం తినకలేక.. మధ్యాహ్నం భోజనం మానేయ్యడంతో నిరసించి సృహతప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు మళ్లీ వంటలు మొదలు పెట్టారు. ఆకలితీర్చేందుకు బిస్కెట్ ప్యాకెట్లను పంచిపెట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి