Hyderabad: మసాజ్ చేయాలని నమ్మించి రప్పించారు.. ఆలా చేయకపోవడంతో గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు

హైదరాబాద్ నగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారిపైనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపైనా దాడులు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే...

Hyderabad: మసాజ్ చేయాలని నమ్మించి రప్పించారు.. ఆలా చేయకపోవడంతో గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు
Arrest Hyderabad
Follow us

|

Updated on: May 15, 2022 | 10:59 AM

హైదరాబాద్ నగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారిపైనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపైనా దాడులు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే జరిగింది. మసాజ్ తోపాటు శారీరకంగా కలిస్తే ఎక్కువ డబ్బులు ఇప్పిస్తామంటూ ఓ మహిళ తన స్నేహితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఆమెను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టింది. ముంబయిలో నివాసముంటున్న కాకులి బిశ్వాస్ ప్రముఖ డ్యాన్సర్ తో పాటు మసాజ్ నిపుణురాలు. ఆమెకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో నివాసముండే సంజనతో స్నేహం ఉంది. తనకు తెలిసిన వారికి మసాజ్‌ చేయడానికి వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారని సంజన చెప్పడంతో బిశ్వాస్‌ అంగీకరించింది. ఈనెల 9న హైదరాబాద్ చేరుకుంది. 10న సంజన స్నేహితులు కోమటి, సునీత సైతం వచ్చారు. అనంతరం తనకు తెలిసిన వారికి మసాజ్ చేయడంతో పాటు వారితో శారీరకంగా ఏకాతంగా గడపాలని సంజన వారికి సూచించింది. ఇలా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని వారికి ఆశ పెట్టింది. మర్దనతో పాటు శారీరక సుఖం అందిస్తే అధిక డబ్బులు ఇస్తారంటూ నచ్చజెప్పింది. సంజన చెప్పినదానికి వారందరూ అంగీకరించారు.

ఈ నెల 12న బిశ్వాస్‌.. క్యాబ్‌లో జూబ్లీహిల్స్‌కు వెళ్లింది. అప్పటికే అక్కడికి కోమటి, సునీతతో పాటు మరో అయిదుగురు పురుషులు వచ్చారు. అక్కడ కోమటి, సునీతలు బిశ్వాస్‌తో గొడవకు దిగారు. కోరుకున్న విధంగా ఉండటం లేదని ఆమెపై దాడి చేశారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బిశ్వాస్ డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు వచ్చి సర్దిచెప్పారు. మరుసటి రోజు(13న) ఉదయం సంజన ఇంటికి వచ్చిన కోమటి, సునీతలు బిశ్వాస్‌ గురించి చెప్పారు. దీంతో ముగ్గురూ బిశ్వాస్‌తో గొడవకు దిగారు. బిశ్వాస్‌ పోలీసులకు కంప్లైంట్ చేస్తాననడంతో వారు మరింత కక్ష పెంచుకున్నారు.

ముగ్గురూ కలిసి ఆమె దుస్తులు తొలగించి, ఓ గదిలో వేసి నిర్బంధించారు. శారీరకంగా దాడి చేశారు. శనివారం ఉదయం వారిబారి నుంచి తప్పించుకున్న బిశ్వాస్.. స్థానిక ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి నుంచి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కోమటి, సునీతలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

Akshay Kumar: కరోనా బారిన పడ్డ బాలీవుడ్ సూపర్‌ స్టార్‌.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు దూరం..

Sharad Pawar: ఎన్సీపీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు.. సినీనటి అరెస్ట్‌..