Hyderabad: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ఆ రెండు రోజుల్లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడంటే..
తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్ వాసులకు జల మండలి అధికారులు కీలక సూచన చేశారు. నగరంలో రెండు రోజుల పాటు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపారు. 1600 ఎంఎం డయా పిఎస్సి గ్రావిటీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ మురుగునీటి బోర్డు ( హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి ) చేపట్టిన మరమ్మతు పనుల కారణంగా నవంబర్ 26 నుండి నవంబర్ 27 వరకు నగరంలోని చాలా చోట్ల 30 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.
హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ( కెడిడబ్ల్యుఎస్పి ) ఫేజ్-2 నీటి లీకేజీలను నివారించడానికి బాలాపూర్ రోడ్లోని శివాజీ చౌక్ వద్ద మరమ్మతులు చేయవలసి ఉంది. బాలాపూర్ రోడ్డులోని హఫీజ్ బాబానగర్ వద్ద 100 అడుగుల రోడ్డు విస్తరణ పనుల కోసం ఎయిర్ వాల్వ్లను పక్కకు మార్చాల్సి ఉంది. దీంతో బాలాపూర్, మైసారం, అల్మాస్గూడ, లెనిన్ నగర్, బడంగ్పేట్, మీరాలం, భోజగుట్ట, శంషాబాద్ ప్రాంతాల్లో నవంబర్ 26వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పనులు కొనసాగుతాయి.
ఈ సమయంలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోనుందని.. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులు తెలియజేశారు జల మండలి అధికారులు . నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం