Kishan Reddy: డబుల్బెడ్రూం ఇళ్ల గురించే ఎక్కువగా ఫిర్యాదులు.. కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు.
Kishan Reddy Padayatra: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది.
సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తుకారంగేట్ బస్తీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. డబుల్బెడ్రూం ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని కిషన్రెడ్డి టీవీ9తో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా మాట్లాడారు.
కాగా.. మధ్యాహ్నం బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారికి వివరిస్తామని కిషన్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు.
సోమవారం కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహించనున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కిషన్ రెడ్డి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..