త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్: కేసీఆర్
‘ఆర్ధికమాంద్యం ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపధ్యంలో వాస్తవ పరిస్థితులకు అణుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలి’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మార్చిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపధ్యంలో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను త్వరలోనే శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. బడ్జెట్ రూపకల్పనపై సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం ప్రగతిభవన్లో కసరత్తు చేశారు. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం నెలకొని […]
‘ఆర్ధికమాంద్యం ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపధ్యంలో వాస్తవ పరిస్థితులకు అణుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలి’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మార్చిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపధ్యంలో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను త్వరలోనే శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. బడ్జెట్ రూపకల్పనపై సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం ప్రగతిభవన్లో కసరత్తు చేశారు. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రాల ఆదాయం తగ్గింని వెల్లడించారు. ఈక్రమంలో… రాష్ట్ర అవసరాలను బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన జరగాలని సీఎం నిర్దేశించారు. ప్రజాసంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూనే ఇతర రంగాలకు అవసరమైన మేర నిధుల కేటాయింపులు జరిగేలా చూడాలని సీఎం నిర్దేశించారు.