Telangana: తెలంగాణలో ఆ తరగతులకు ప్రత్యక్ష బోధన.. దీపావళి తర్వాత నుంచి.!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దీపావళి తర్వాత నుంచి 1-5 తరగతుల విద్యార్ధులకు ప్రత్యక్ష బోధన నిర్వహించాలని ప్రైవేటు స్కూళ్ల...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దీపావళి తర్వాత నుంచి 1-5 తరగతుల విద్యార్ధులకు ప్రత్యక్ష బోధన నిర్వహించాలని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు తల్లిదండ్రులకు కూడా సమాచారాన్ని అందించారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 6-10 తరగతుల విద్యార్ధులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. దీనితో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ తదితర నగరాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో 30-40 శాతం మాత్రమే హాజరు నమోదవుతోంది.
అయితే నవంబర్ నుంచి అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభిస్తే మరో 20 శాతం హాజరు పెరిగే అవకాశాలు ఉండొచ్చని ప్రైవేటు యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయంపై ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ఇస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ.. ”ప్రత్యక్ష తరగతులు మొదలయ్యే రెండు నెలలు పూర్తవుతోంది. కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతుండటంతో పిల్లల్ని స్కూల్స్కు పంపించేందుకు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయరని అన్నారు. అలాగే తల్లిదండ్రుల్లో మరింత భరోసాను పెంచేందుకు వైద్యారోగ్య శాఖ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
ఇవి చదవండి:
Viral Video: చెరువులో ఈత కొడుతున్న వ్యక్తి.. అంతలో మొసలి మెరుపు దాడి.. చివర్లో ట్విస్ట్ అదుర్స్.!
IPL 2022: వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్రైజర్స్ జట్టు..
Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..