ఈ నెల 16 నుంచి ఆరోగ్య శ్రీ బంద్..!
ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ సేవలను ఈ నెల నుంచి నిలిపివేయనున్నట్లు ఆరోగ్య శ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు అరకొరగా.. చికిత్స అందిస్తుంటే.. ఇప్పుడు ఆ చికిత్సలకు కూడా బ్రేక్ పడనుంది. ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు దాదాపు రూ.1500 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో.. ఇక ఆరోగ్య శ్రీ, ఈజేహెచ్ఎస్ చికిత్సలను అందించడం తమ వల్ల కాదని అని చేతులెత్తేశాయి. […]
ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ సేవలను ఈ నెల నుంచి నిలిపివేయనున్నట్లు ఆరోగ్య శ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు అరకొరగా.. చికిత్స అందిస్తుంటే.. ఇప్పుడు ఆ చికిత్సలకు కూడా బ్రేక్ పడనుంది. ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు దాదాపు రూ.1500 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో.. ఇక ఆరోగ్య శ్రీ, ఈజేహెచ్ఎస్ చికిత్సలను అందించడం తమ వల్ల కాదని అని చేతులెత్తేశాయి. తాజాగా.. భేటీ అయిన ‘ఆరోగ్య శ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్’ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాము ఆరోగ్య శ్రీ సేవలను కొనసాగించాలంటే.. ప్రభుత్వం తమ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఈ నెల 15లోగా బకాయిలన్నీ పూర్తిస్థాయిలో చెల్లించని పక్షంలో ఆరోగ్య శ్రీ చికిత్సలు అందించడం నిలిపివేస్తామని తెలిపాయి.
ఇటీవలే 20 రోజు కిందట తన్హా బృందం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలిసి బకాయిల అంశంపై వినతిపత్రాన్ని అందజేసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆరోగ్య శ్రీ చికిత్సలు నిలిపివేయడం తప్పనిసరి అవుతోందని బృందం అధ్యక్షుడు రాకేష్ తెలిపారు.