Railway News: దసరా రద్దీ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే.. అవసరానికి అనుగుణంగా..
నగరంలోని పలు కీలక ప్రాంతాల నుంచి జిల్లాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఇక రైల్వే అధికారులు కూడాఈ ఏడాది భారీగానే ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు... ఇందులో భాగంగానే సికింద్రాబాద్ నుంచి..
దసర పండుగను పురస్కరించుకొని ప్రజలు సొంతూళ్లకు పయనణమవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వేలాది సంఖ్యలో జనాలు పల్లెబాట పట్టారు. బస్సులు, సొంత వాహనాలు, రైళ్ల ద్వారా సొంతూళ్లకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీతో పాటు ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నగరంలోని పలు కీలక ప్రాంతాల నుంచి జిల్లాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఇక రైల్వే అధికారులు కూడాఈ ఏడాది భారీగానే ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు.
తాజాగా ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ ప్రత్యేక ఏర్పాట్లపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దసరా పండగకు 315 ప్రత్యేక రైళ్ళని నడుపుతున్నాం. కొన్ని స్పెషల్ రైళ్లకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాం. ఒకవేళ ఇంకా రద్దీ పెరిగితే అదనపు బోగీలు’ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదిలా ఉంటే పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు రైళ్ల సమయాన్ని తెలుసుకొని స్టేషన్కు చేరుకోవాలని తెలిపారు.
ఇక పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్లను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాచిగూడ, విజయవాడలో 10 రూపాయల చార్జీలను 20 రూపాయలకు పెంచారు. పండుగ నేపథ్యంలో రద్దీ స్టేషన్కి అనవసరంగా వచ్చే వారిని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ ఒకటి రెండు రోజుల్లో ప్లాట్ ఫామ్ టికెట్ చార్జీలు పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..