Hyderabad: షోరూమ్‌ బాత్రూంలోకి వెళ్లి ఎంతకూ బయటకు రాని సేల్స్‌మెన్.. అనుమానంతో తలుపులు బద్దలు కొట్టగా

హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఓ సేల్స్‌మెన్ తాను పనిచేస్తున్న మాల్ బాత్రూంలోనే తనువు చాలించాడు. ఇవి వివరాలు....

Hyderabad: షోరూమ్‌ బాత్రూంలోకి వెళ్లి ఎంతకూ బయటకు రాని సేల్స్‌మెన్.. అనుమానంతో తలుపులు బద్దలు కొట్టగా
representative image
Follow us

|

Updated on: Jul 03, 2022 | 5:39 PM

Crime News: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్(KPHB).. పైగా వందలాది మంది వచ్చి పోయే షాపింగ్ మాల్. అందులో ఓయువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా(srikakulam district)కు చెందిన బలరాం.. ఎళ్ళమబండలో నివసిస్తున్నాడు. కె.పి.హెచ్.బి కాలనీలోని జి.ఆర్.టి జ్యువెల్లర్స్ షో రూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం కూడా డ్యూటీకి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో షోరూమ్‌లో ఉన్న బాత్రూం లోకి వెళ్లాడు. ఎంత సేపటికీ బయటకు రాలేదు. కొద్ది సేపటి తర్వాత అనుమానం వచ్చి సిబ్బంది వెళ్లి డోర్ కొట్టారు. కానీ లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. దీంతో డోర్ బద్దలు కొట్టారు. లోపల బలరాం ఉరేసుకుని ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమవ్యవహారం కారణంగానే బలరాం.. బలవన్మరణానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటివరకూ తమతోనే ఉన్న వ్యక్తి.. అంతలోనే విగతజీవిగా మారడంతో.. తోటి స్టాఫ్ దిగ్భ్రాంతికి గురయ్యారు.

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి