ఏడేళ్ల బాలుడు కిడ్నాప్.. నిందితుడు ఎవరంటే?

ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అనంతరం కిడ్నాపర్ ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశాడు. అయితే ఏమి చేయాలో తెలియక ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకెళితే… రాజ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్య, కొడుకు అర్జున్(7)తో కలిసి మీర్‌పేటలోని టీఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న అర్జున్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. పిల్లాడు ఏమైపోయాడోనని […]

ఏడేళ్ల బాలుడు కిడ్నాప్.. నిందితుడు ఎవరంటే?
Follow us

| Edited By:

Updated on: Nov 19, 2019 | 3:04 PM

ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అనంతరం కిడ్నాపర్ ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశాడు. అయితే ఏమి చేయాలో తెలియక ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకెళితే… రాజ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్య, కొడుకు అర్జున్(7)తో కలిసి మీర్‌పేటలోని టీఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న అర్జున్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. పిల్లాడు ఏమైపోయాడోనని తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత రాజ్‌కుమార్ కు  ఓ నంబర్‌ను నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. రూ.3లక్షలిస్తేనే వదిలిపెడతాం’ అంటూ అవతలి వ్యక్తి చెప్పి కాల్ కట్ చేశాడు.

దీంతో ఆందోళనపడిన రాజ్‌కుమార్ వెంటనే మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈలోగా ఆ కిడ్నాపర్ పదేపదే రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయసాగాడు. దీంతో పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ ఉన్న లొకేషన్ గుర్తుపట్టి అక్కడికి చేరుకున్నారు. ఆ కిడ్నాపర్‌ని చూశాక ఒక్కసారిగా  అంతా షాకయ్యారు. కారణం.. నిందితుడు ఏ కరడుగట్టిన నేరస్థుడో కాదు… పదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలుడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని పట్టుకుని జీపులో ఎక్కించారు. అర్జున్‌ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??