హైదరాబాద్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన.. నేడు మిసైల్ పరీక్ష పరిశీలన
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న రాజ్నాథ్ .. రెండు రోజుల పాటు పర్యటన ఉండనుంది. దుండిగల్...
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న రాజ్నాథ్ .. రెండు రోజుల పాటు పర్యటన ఉండనుంది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమిలో ట్రైనీలతో ఆయన ముఖాముఖి అయ్యారు. అలాగే శనివారం ట్రైనీ పైలట్ల పరేడ్లో రాజ్నాథ్ పాల్గొంటారు. మధ్యాహ్నం సీఎస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం అగ్ని మిసైల్ పరీక్షను స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. రేపు సాయంత్రం పహాడీషరీఫ్లో ఆర్సీఐలో డీఆర్డీవో రక్షణ పరికరాలను ఆయన పరిశీలిస్తారు.