ఈవీఎం, వీవీప్యాట్లకు కట్టుదిట్టమైన భద్రత: రజత్ కుమార్
తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగిందన్నారు ఈసీ రజత్ కుమార్. ఈవీఎం, వీవీ ప్యాట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించామన్నారు. ఓట్ల లెక్కింపుకు ఇంకా 41 రోజులు గడువు వుండడంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించిన ఈవీఎం, వీవీ ప్యాట్లను యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరిచి హై సెక్యూరిటీ ఏర్పాటు చేశామని తెలిపారు రజత్ కుమార్.
తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగిందన్నారు ఈసీ రజత్ కుమార్. ఈవీఎం, వీవీ ప్యాట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించామన్నారు. ఓట్ల లెక్కింపుకు ఇంకా 41 రోజులు గడువు వుండడంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించిన ఈవీఎం, వీవీ ప్యాట్లను యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరిచి హై సెక్యూరిటీ ఏర్పాటు చేశామని తెలిపారు రజత్ కుమార్.