మరికాసేపట్లో జూడాలతో మంత్రి ఈటల చర్చలు
జూడాల ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరికాసేపట్లో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపనున్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. మంత్రి ఈటలతో చర్చలు సఫలమైతే జూడాలు తమ ఆందోళనలను విరమించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్న జూడాల ఆందోళనలు, సమ్మెతో ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు […]
జూడాల ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరికాసేపట్లో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపనున్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. మంత్రి ఈటలతో చర్చలు సఫలమైతే జూడాలు తమ ఆందోళనలను విరమించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్న జూడాల ఆందోళనలు, సమ్మెతో ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.