Hyderabad: అయ్యో దేవుడా..! కుమార్తె బర్డ్ డే రోజున.. కేకు ఆర్డర్ ఇచ్చి వస్తుండగా.. అంతలోనే ఊహించని ప్రమాదం..
కుమార్తె పుట్టిన రోజు.. ఆ తండ్రి సంతోషం, హాడావుడి అంతా ఇంత కాదు.. ఆమె బర్త్ డే పార్టీని ఘనంగా జరుపుదాం.. అనుకున్నాడు. ఈ వేడుక కోసం బేకరీకి వెళ్లి కేక్ కూడా ఆర్డర్ చేశాడు.. అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా.. ఊహించని ప్రమాదం జరిగింది.
కుమార్తె పుట్టిన రోజు.. ఆ తండ్రి సంతోషం, హాడావుడి అంతా ఇంత కాదు.. ఆమె బర్త్ డే పార్టీని ఘనంగా జరుపుదాం.. అనుకున్నాడు. ఈ వేడుక కోసం బేకరీకి వెళ్లి కేక్ కూడా ఆర్డర్ (birthday cake) చేశాడు.. అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా.. ఊహించని ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆ తండ్రి దుర్మరణం చెందాడు. ఆ విషయం తెలియక తన తండ్రి తనకోసం కేకు తీసుకుని వస్తాడని చిన్నారి ఎదురుచూస్తుండటం స్థానికులను మరింత కలిచివేసింది. ఈ దుర్ఘటన హైదరాబాద్ నగరంలో శనివారం చోటుచేసుకుంది. కుమార్తె పుట్టినరోజు కావడంతో కేకు ఆర్డర్ ఇచ్చి వస్తుండగా.. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు గోల్కోండ పోలీసులు తెలిపారు.
గోల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రామన్నపాలేనికి చెందిన జయరాజు కుమారుడు రవి (30) కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. విప్రో కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న రవి.. గోల్కొండ, రామ్దేవ్గుడాలో కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నారు. రవి దంపతులకు ఇద్దరు సంతానం. కాగా.. శనివారం కుమార్తె పుట్టిన రోజు కావడంతో కేకు కోసం సాయంత్రం బయటకు వెళ్లాడు.
ఈ క్రమంలో నార్సింగిలోని ఓ బేకరీలో బర్డ్ డే కేకు ఆర్డర్ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు. తారామతి – బారాదరి వద్దకు రాగానే ముందున్న వాహనాన్ని దాటబోయి బైక్పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
అయితే, ఈ విషయం తెలిస్తే భార్య స్పందన ఎలా ఉంటుందోనని.. పోలీసులు వెంటనే చెప్పేందుకు వెనుకాడారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..