Hyderabad: వీళ్లేం దొంగలురా నాయనా.. చోరికి ముందు ఏం చేశారో తెలిస్తే స్టన్ అవుతారు

హైదారాబాద్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎల్లమ్మబండలో చోరీకి ముందు ఈ దొంగలు చేసిన పనేంటో తెలిస్తే మీరు సైతం కంగుతింటారు.

Hyderabad: వీళ్లేం దొంగలురా నాయనా.. చోరికి ముందు ఏం చేశారో తెలిస్తే స్టన్ అవుతారు
representative image
Follow us

|

Updated on: Aug 18, 2022 | 8:44 AM

Telangana: ఎవరి కంటికి కనిపించకుండా వచ్చామా…? దొరికినంత దోచేశామా..? చప్పిడి కాకుండా వెళ్లిపోయామా..? అన్నట్లు ఉండేవాళ్లు ఒకప్పుడు దొంగలు. కానీ కాలంతో పాటే వాళ్లు ఇప్పుడు అప్‌డేట్ అయ్యారు. కొందరైతే దొంగతనానికి వచ్చిన ఇళ్లలోనే కాసేపు నిద్రపోయి వెళ్తున్నారు. ఇంకొందరు ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు తింటున్నారు. అలాంటి దొంగతనమే హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్లమ్మబండ(Yellamma Banda)లో వెలుగుచూసింది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన దొంగలు.. బీరువా ఓపెన్ చేసి లోపల ఉన్న గోల్డ్, సిల్వర్‌తో పాటు డబ్బు కూడా దోచుకెళ్లారు. అంతే కాదండోయ్.. కాస్త ఎనర్జీ కావాలనుకున్నారో ఏమో.. రిఫ్రిజిరేటర్‌లో ఉన్న పాలను.. హీట్ చేసుకుని మరీ తాగి వెళ్లారు. ఈ విషయం తెలిసిన స్థానికులు స్టన్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్న పద్మ అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మెహిదీపట్నంలో ఉంటుంది. మనవడి బర్త్ డే ఉండటంతో అక్కడికి వెళ్లింది పద్మ కుటుంబం. మరసటి రోజు పొద్దున్నే తిరిగి వచ్చిన వీరికి ఇంటి తాళం పగలగొట్టి కనిపించింది. దీంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువా తాళం కూడా విరగ్గొట్టి ఉంది. అందులోని 30 తులాల వెండితో పాటు, ఎనిమిది తులాల గోల్డ్ ఆర్మమెంట్స్, 20 వేల క్యాష్ ఎత్తుకెళ్లారు దొంగలు. చిన్న కుమార్తె పెళ్లి కోసం వాటిని దాచి ఉంచారు పద్మ.  ఘటనపై  జగద్గిరిగుట్ట(Jagathgiri Gutta) పోలీసులకు కంప్లైంట్ చేయగా.. వారు క్లూస్‌టీంతోవచ్చి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన ఈ కేసు స్టేటస్ ఏంటి అన్నది తేలాల్సి ఉంది. ప్రజంట్ పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళ్లను అలెర్ట్ చేసేందుకు ఈ కథనం ఇస్తున్నాం. జర భద్రం.

Theft

మరిన్ని క్రైమ్ వార్తల కోసం  ఈలింక్ క్లిక్ చేయండి