Hyderabad: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్.. ప్రత్యేక పూజలను నిర్వహించిన తమిళి సై
గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ భాగ్య లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా హారతిలో పాల్గొన్నారు. ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ తమిళ సైను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువాతో ఘనంగా సత్కరించింది.
Hyderabad: హైదరాబాద్ నగరంలోని అతిపురాతన చారిత్రాత్మక కట్టడం చార్మినార్ దగ్గర ఉండే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్కు పూర్ణకుంభంతో భాగ్యలక్ష్మి దేవాలయ ట్రస్టీ చైర్మన్ శశికళ బృందం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా హారతిలో పాల్గొన్నారు. ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ తమిళ సైను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువాతో ఘనంగా సత్కరించింది.
భాగ్యలక్ష్మి ఆలయం చాలా ప్రాచీనమైంది. పూర్వం ఈ ఆలయం పేరు మీదనే హైదరాబాద్ను భాగ్యనగరం అని పిలిచేవారని చరిత్రకారుల కథనం. భాగమతి పేరు మీద నవాబులు హిందువుల కోసం ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయాన్ని నిర్మించారని కూడా కొంతమంది చెబుతారు. ఈ ఆలయంలో లక్ష్మీదేవి కొలువు దీరింది. ప్రతిరోజు పూజలు జరుగుతాయి. శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఐదుసార్లు అమ్మవారికి హారతి ఇస్తారు. హిందువుల సంప్రదాయం ప్రకారం దీపావళి, బోనాల పండుగ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..