Dogs Attack : వీధికుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. చిన్నారులను బయటకు పంపేందుకు వణికిపోతున్న పేరెంట్స్
వీధికుక్కలు పసిపిల్లలు ప్రాణాలు తీసేస్తున్నాయి. ఒంటరిగా వెళ్తున్న పిల్లలు కనపడితే చాలు వారిని బలి తీసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ కిషన్బాగ్లో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు...
Dogs Attack : వీధికుక్కలు పసిపిల్లలు ప్రాణాలు తీసేస్తున్నాయి. ఒంటరిగా వెళ్తున్న పిల్లలు కనపడితే చాలు వారిని బలి తీసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ కిషన్బాగ్లో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు తీశాయి. కుక్కల దాడిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకునే పనిలో పడ్డారు. పసిప్రాయంలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. వీధికుక్కల దాడిలో తీవ్రగాయాలపాలై మృత్యువాత పడ్డాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గ్రామ సింహాలు రెచ్చిపోతుండటంతో చిన్నారులను రోడ్లపైకి పంపాలంటేనే పేరెంట్స్ వణికిపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి కుక్కల బెడద నుంచి తమ పిల్లల్ని కాపాడాలని కోరుతున్నారు.