లాక్డౌన్ ఉల్లంఘన.. తెలంగాణలో 1.21లక్షల వాహనాలు సీజ్..!
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నా.. కొంతమంది ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నా.. కొంతమంది ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొంతమంది పెడచెవున పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి బుద్ధి తెప్పించడం కోసం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేశారు. ఇలా ఇప్పటివరకు 1.21లక్షల వాహనాలను సీజ్ చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ వాహనాలను కోర్టుకు తీసుకువెళ్తామని.. వాహనాలు కావాలనుకునే ఓనర్లు లాక్డౌన్ తరువాత అక్కడికి వెళ్లి వాటిని తీసుకోవచ్చునని ఆయన సూచించారు. ఇందులో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వాహనాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేయబోతున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. ఇప్పటికే వాహనాదారులకు ఇచ్చిన పాసులను రద్దు చేశామని ఆయన అన్నారు. ఎలాంటి పనులు లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తప్పవని అంజన్ కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
Read This Story Also: పవన్ హీరోయిన్పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!