లాక్డౌన్ బేఖాతరు.. కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్..!
కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే ఈ లాక్డౌన్ను చాలా చోట్ల బేఖాతరు చేస్తున్నారు.
కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే ఈ లాక్డౌన్ను చాలా చోట్ల బేఖాతరు చేస్తున్నారు. మామూలు రోజుల్లో లాగానే వాహనాలతో జనం బయటకు వస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని కూకట్పల్లిలో భారీ సంఖ్యలో జనం బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉండటంతో కూకట్పల్లి వై జంక్షన్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలో సరైన కారణం లేకుండా బయటకు వచ్చే వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.
Read This Story Also: టాస్క్ కంప్లీట్ చేసిన చెర్రీ.. ఎవరెవరికి సవాల్ విసిరారంటే..!