గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ!

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో ఈ సాయంత్రం పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ!
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2019 | 7:59 PM

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో ఈ సాయంత్రం పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.