Telangana: ‘BJP గెలవబోయే 20వ రాష్ట్రం తెలంగాణ’.. సభా వేదికపై ఈటల సంచలన కామెంట్స్
BJP గెలవబోయే 20వ రాష్ట్రం తెలంగాణే అంటూ సంచలన కామెంట్స్ చేశారు ఈటల. తెలంగాణ గడ్డపై BJP గెలవాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు.
PM Modi Speech: బీజేపీ విజయ సంకల్ప సభకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సభలో ప్రసంగించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(eatala rajender) టీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి వంచించిన వ్యక్తిత్వం కేసీఆర్(CM KCR)ది అని మండిపడ్డారు. ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది అని ప్రశంసించారు. బీసీ వర్గాలకు TRS మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. దళితులు, గిరిజనులపై గౌరవం ఉంటే ద్రౌపది ముర్ముకు కేసీఆర్ మద్దతు ఇవ్వాలన్నారు. TRS ఫ్లెక్సీ రాజకీయాలపై ఈటల మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తనకు సంబంధం లేకపోయినా, అవసరం లేకపోయినా.. రూ.33 కోట్ల ప్రజాధనంతో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఫేస్ చూసేందుకు ప్రజానీకానికి ఇష్టం లేకున్నా బలవంతంగా రుద్దారని పేర్కొన్నారు. మోదీ ఫ్లెక్సీల్లో లేకున్నా 130 కోట్ల మంది ప్రజలు హృదయాల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ విషయంలో తెలంగాణ ప్రజలకు విసుగెత్తిందని ఆరోపించారు.
BJP గెలవబోయే 20వ రాష్ట్రం తెలంగాణే అంటూ సంచలన కామెంట్స్ చేశారు ఈటల.తెలంగాణ గడ్డపై BJP గెలవాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్, TRSను ఓడించాలని అందరూ నిర్ణయించుకున్నారని చెప్పారు. మోదీ అండతో బంగారు తెలంగాణ సాధించుకుందామన్నారు ఈటల.