Hyderabad: మందు బాబు వీరంగం.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..
మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం తాగి రోడ్లకు మీదికి వచ్చి ఇతరులకు ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి దగ్గర గుర్తుతెలియని వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..
హైదరాబాద్లో మందు బాబులు రెచ్చిపోతున్నారు.. ఫుల్లుగా మద్యం తాగి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ర్యాష్ డ్రైవింగ్తో బెంబేలెత్తిస్తున్నారు. లంగర్ హౌస్ ఘటన మరవక ముందే హబీబ్నగర్లో మరో ర్యాష్ డ్రైవింగ్ ఘటన నమోదైంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి దగ్గర గుర్తుతెలియని వ్యక్తి హోండా సిటీ కారులో రాష్ డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు.
రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. మల్లేపల్లి అన్వర్ ఉలూమ్ కళాశాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టయోటా వాహనదారుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా నాలుగైదు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడున్న ప్రజలు చూస్తుండగానే కారు రివర్స్ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ప్రస్తుతం ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లో వరుస ఘటనలు జనాలను భయపెడుతున్నాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేసి అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నారు, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నా మందుబాబుల వైఖరిలో మార్పు రావడం లేదు, దీంతో రాత్రి పూట రోడ్డెక్కాలంటేనే జనాలు భయపడుతున్నారు, ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటి ఘటనలకు చెక్ పడవని బాధితులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..