Hyderabad: నీరజ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన కామెంట్స్ చేసిన సంజన తల్లి..

Hyderabad: శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో దారుణ హత్యకు గురైన నీరజ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు నీరజ్‌ను..

Hyderabad: నీరజ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన కామెంట్స్ చేసిన సంజన తల్లి..
Niraj
Follow us

|

Updated on: May 21, 2022 | 1:58 PM

Hyderabad: శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో దారుణ హత్యకు గురైన నీరజ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు నీరజ్‌ను అత్తింటివారే చంపించారనే ప్రచారం జరుగగా.. ఆ హత్యకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు సంజన తల్లి మధు భాయ్. ఇదే అంశంపై టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కూతురు సంసారాన్ని నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు. తన అల్లుడు నీరజ్ హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నీరజ్‌ను చంపి.. తన కూతురు సంసారాన్ని నాశనం చేశారంటూ కన్నీరుమున్నీరయ్యారు. నీరజ్‌ను హత్య చేసిన వాళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

గత ఆరు నెలలుగా తన కూతురిని, అల్లుడిని చంపుతామని కొందరు బెదిరించారని వెల్లడించారు సంజన తల్లి మధు భాయ్. వాళ్లు ఎవరనేది తమకు తెలియదన్నారు. నీరజ్ హత్య జరిగిన సమయంలో తన కొడుకు రితేష్, బావ, కుమారులు నలుగురూ ఇంట్లోనే ఉన్నారన్నారు. హత్య తో వాళ్లకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. హత్య జరిగిన విషయం తెలుసుకొని భయపడి ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పారు. సంజన సోదరి మమత మాట్లాడుతూ.. ఏడాదిగా తమ సోదరితో తమ కుటుంబానికి మాటలు లేవని చెప్పింది. తమ అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెండు నెలలుగా సంజన తనతో ఫోన్‌లో మాట్లాడుతుందని తెలిపింది. ప్రేమ వివాహం ఇష్టం లేకే ఆమెను దూరం పెట్టామని, అయినప్పటికీ ఆమె తన భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని తామంతా కోరుకున్నామన్నారు. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నారు. హత్యతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మమత తెలిపింది.