గణపతి చందా అంటూ వచ్చారు..

నిజామాబాద్‌ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గణపతి చందా ముసుగులో ఓ ఇంట్లోకి దూరిన నలుగురు దుండగులు చోరీకి యత్నించారు.నగరంలోని వినాయక నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వినాయక చందా పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నలుగురిలో ఇద్దరు ఫస్ట్‌ఫ్లోర్‌కు వెళ్లారు.చందా కావాలని అడిగారు. అదే సమయంలో తాగడానికి మంచి నీళ్లు కావాలని అడిగారు. నీళ్లతో వచ్చిన మహిళ మెడలోంచి గొలుసు లాగేందుకు ప్రత్నించారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయటంతో పారిపోవాలని చూశారు.అప్పటికే బయటకు వచ్చిన […]

గణపతి చందా అంటూ వచ్చారు..
Follow us

|

Updated on: Aug 29, 2019 | 5:58 PM

నిజామాబాద్‌ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గణపతి చందా ముసుగులో ఓ ఇంట్లోకి దూరిన నలుగురు దుండగులు చోరీకి యత్నించారు.నగరంలోని వినాయక నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వినాయక చందా పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నలుగురిలో ఇద్దరు ఫస్ట్‌ఫ్లోర్‌కు వెళ్లారు.చందా కావాలని అడిగారు. అదే సమయంలో తాగడానికి మంచి నీళ్లు కావాలని అడిగారు. నీళ్లతో వచ్చిన మహిళ మెడలోంచి గొలుసు లాగేందుకు ప్రత్నించారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయటంతో పారిపోవాలని చూశారు.అప్పటికే బయటకు వచ్చిన స్థానికులు అందులో ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ జరిగిన ఈ దృశ్యాలన్నిఅక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.