ఎమ్మార్వో కార్యాలయంలో పెట్రోల్ కలకలం
తెలంగాణ ఎమ్మార్వో కార్యాలయంలో పెట్రోల్ కలకలం చెలరేగింది. తహసీల్దార్ ఆఫీసు లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో సూసైడ్ చేసుకుంటానని తండ్రీ కూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి కోహెడ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా...
తెలంగాణ ఎమ్మార్వో కార్యాలయంలో పెట్రోల్ కలకలం చెలరేగింది. తహసీల్దార్ ఆఫీసు లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని పెట్రోల్ డబ్బాలతో సూసైడ్ చేసుకుంటానని తండ్రీ కూతుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాల నుంచి కోహెడ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మార్వో ఆఫీసు లోపలికి పెట్రోల్ డబ్బాలతో వెళ్లి తలుపులు వేసుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం చెంచల చెరువులపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతి రెడ్డి, అతని కుమార్తె స్వరూప స్థానికంగా జీవనం సాగిస్తూండేవారు. కొద్ది సంవత్సరాల క్రితం తన తండ్రి తిరుపతి రెడ్డికి చెందిన ఎకరం 30 గుంటల భూమిని.. తన పేరు మీద 2011లో రిజిస్ట్రేషన్ చేయించారని అప్పటి నుండి మ్యూటేషన్ చేయాలని ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు స్వరూప పేర్కొంది.
ఈ మధ్య కాలంలో పహాణీలో తన తండ్రి పేరును తొలగించి వేరే వాళ్ల పేరు మీద భూమిని నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఉన్న ఎమ్మార్వో, ఇప్పుడున్న ఎమ్మార్వో భూమి మోక మీదకి వచ్చి తనిఖీ చేసి హద్దులు నిర్ణయించి భూమి తమ పేరు మీదనే చేస్తామని అంటున్నారనీ, కానీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు చెబుతున్నా.. తిరిగి మళ్లీ తమనే బెదిరిస్తున్నారని వాపోయారు. కాగా తమకు న్యాయం చేసేంత వరకూ ఎమ్మార్వో ఆఫీసులోనే ఉంటామని లేకుంటే ఇక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు బెదిరిస్తున్నారు.
Read More:
సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భారతీరాజా
డీప్ కోమాలోనే ప్రణబ్ ముఖర్జీః ఆర్మీ ఆస్పత్రి వైద్యులు
బ్రేకింగ్ః తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్