ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌ స్ప్రే ..!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డిపై రైతు సురేష్‌ పెట్రోల్‌ పోసి, సజీవ దహనం చేసిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. తాజాగా మరో తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు పెట్రోల్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన మరోమారు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కరీంనగర్‌ జిల్లా లంబాడిపల్లెకి చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్‌ కార్యాలయంలోని సిబ్బందిపై పెట్రోల్‌ చల్లాడు. దీంతో ఆఫీసులోని కంప్యూటర్లు, వీఆర్వో అనిత, కంప్యూటర్‌ ఆపరేటర్‌ జగదీష్‌, అటెండర్‌ దివ్య, ఇతర సిబ్బందిపై పెట్రోల్‌ […]

ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌ స్ప్రే ..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 4:35 PM

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డిపై రైతు సురేష్‌ పెట్రోల్‌ పోసి, సజీవ దహనం చేసిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. తాజాగా మరో తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు పెట్రోల్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన మరోమారు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కరీంనగర్‌ జిల్లా లంబాడిపల్లెకి చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్‌ కార్యాలయంలోని సిబ్బందిపై పెట్రోల్‌ చల్లాడు. దీంతో ఆఫీసులోని కంప్యూటర్లు, వీఆర్వో అనిత, కంప్యూటర్‌ ఆపరేటర్‌ జగదీష్‌, అటెండర్‌ దివ్య, ఇతర సిబ్బందిపై పెట్రోల్‌ పడింది. ఇంతలో అతడిని మిగతా సిబ్బంది అడ్డుకున్నారు. అయితే, ఆ కార్యాలయ సిబ్బంది భూమి పట్టా మంజూరు చేయట్లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కనకయ్యకు 4.2 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, 18 గుంటలకే పాస్‌బుక్‌ ఇచ్చారని, మిగతా భూమికి సంబంధించిన పాస్‌బుక్‌ కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు పెట్రోల్‌ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. కాగా, అధికారులు మాత్రం కనకయ్య భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఉందని, విచారణ చేసిన తర్వాత రైతు కనకయ్యకు న్యాయం చేస్తామని ఆర్డీవో ఆనందరావు తెలిపారు. జరిగిన విషయంపై జేసీ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌..కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. కనకయ్యపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్యాలయానికి చేరుకున్న పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. రైతు చేసిన పనికి తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేయలేమని వారు చెబుతున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!