Telangana – YS Sharmila: షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు రాదా..? మరి షర్మిల రియాక్షన్ ఏంటి..!
Telangana - YS Sharmila: తెలంగాణలో తనదైన ముద్ర వేస్తూ, రాజన్న రాజ్యం తెస్తానంటున్న వైఎస్ షర్మిల..
Telangana – YS Sharmila: తెలంగాణ(Telangana)లో తనదైన ముద్ర వేస్తూ, రాజన్న రాజ్యం తెస్తానంటున్న వైఎస్ షర్మిల(YS Sharmila).. పార్టీ(YSR Party) పెడాతనని చెప్పి దాదాపు ఏడాది అవుతోంది. 2021 ఫిబ్రవరి 9న హైదరాబాద్(Hyderabad)లో కార్యకర్తలతో సమావేశం పెట్టి పార్టీ పెడుతున్నానని చెప్పిన ఆమే అప్పటికే ఎన్నికల సంఘం రిజిష్ట్రేషన్ కోసం దరఖస్తు చేశారు. జులై 9న అధికారికంగా సభ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణ చేసి జెండా, అజేండా ప్రకటించారు. కాని ఇప్పటికీ షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు మాత్రం పోందలేదు.
షర్మిల పార్టీ పెరు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆమే పార్టీని గుర్తించవద్దని, అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ భాషా ఢిల్లి కోర్టులో ఫీర్యాదు చేశారు. మరోవైపు ఎన్నికల సంఘానికి కుడా పార్టీకి గుర్తింపునివ్వడంపై తమకు అభ్యంతారాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ పేరు మీద మరో పార్టీ వస్తే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని అయన ఈసీకి వివరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈసీ షర్మిల పార్టీ గుర్తింపు గురించి పెద్దగా ముందడుగు వేయడం లేదు. ప్రతి నెల కొన్ని ప్రశ్నలతో లెటర్లు మాత్రం రాస్తూ పార్టీ గుర్తింపు ప్రక్రియను పుర్తి చేయడం లేదు.
దీనిపై షర్మిల కుడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దరఖస్తు చేసుకొని ఏడాది అయినా ఇప్పటి వరకు గుర్తింపు ఇవ్వకుండా ఈసీ తాత్సారం చేయడం అర్ధం కావడం లేదని అసంతృప్తితో ఉన్నారు. దీనిపై నేరుగా ఈసీని అడగడమే కరెక్ట్ అని షర్మిల భావిస్తున్నారు. వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటన్నాం కాబట్టి తన తల్లి, వైఎస్ఆర్ భార్య విజయలక్షి నుండి ఎలాంటి అభ్యంతరాలు లేవని సర్టీఫికెట్ కుడా ఇచ్చినా ఈసీకి ఇంకా ఎం అభ్యంతరమో అర్ధం కావడం లెదంటు వైఎస్ షర్మిల తన నిరసన తెలిపారు.
ఈ విషయంలో తనపె కుట్ర కుడా ఉండొచ్చునని వైఎస్ షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ గుర్తింపు లేకుండా ఎలా కార్యక్రమాలు చేపట్టాలా? అని కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఈసీ పార్టీ పేరు మార్చుకోమని సూచిస్తే మొదటికే మోసం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అగస్త్య, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
Also read:
Jio 5g Phone: మరో సంచలనానికి తెర తీస్తోన్న జియో.. అత్యంత తక్కువ ధరలో 5జీ ఫోన్..
UP Elections 2022: ఖేరీ జిల్లాలో నామినేషన్ కోసం కౌంట్డౌన్ షురూ.. అభ్యర్థులను ప్రకటించని పార్టీలు!