అంత్యక్రియలు చేస్తుండగా లేచి కూర్చుంది

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించే ఓ ఘటన ఇటీవల చోటు చేసుకుంది. కొద్దికాలం నుంచి ఓ మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా.. ఆదివారం ఆమెను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు బోరున విలపిస్తూ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో అంత్యక్రియలు జరగాల్సి ఉండగా.. అందరికి షాక్ ఇస్తూ చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుంది. దానితో ఆమె కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కాగా కొంతసేపటికి […]

అంత్యక్రియలు చేస్తుండగా లేచి కూర్చుంది
Follow us

|

Updated on: Jun 03, 2019 | 12:03 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించే ఓ ఘటన ఇటీవల చోటు చేసుకుంది. కొద్దికాలం నుంచి ఓ మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా.. ఆదివారం ఆమెను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు బోరున విలపిస్తూ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో అంత్యక్రియలు జరగాల్సి ఉండగా.. అందరికి షాక్ ఇస్తూ చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుంది. దానితో ఆమె కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కాగా కొంతసేపటికి వారు తేరుకుని ఆమెను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇక ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

సారంగపూర్ గ్రామానికి చెందిన కనకమ్మ అనే మహిళ కొన్నేళ్ల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతుండేది. దీంతో ఆమెకు అత్యవసర చికిత్స అందించడం కోసం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇక చేసేది ఏమి లేక కుటుంబసభ్యులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. అయితే అందరిని ఆశ్చర్యపరుస్తూ ఆమె లేచి కూర్చుంది. దీనికి ఆమె కుటుంబసభ్యులు ఒకింత షాక్‌కు గురయ్యారు.కాగా మెరుగైన చికిత్స కోసం ఆమెను జగిత్యాలలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.